శని, సూర్యుని కారణంగా సెప్టెంబర్ నెలలో ఈ 5 రాశులపై ప్రభావం
Shani-Surya Impacts : 2026 సెప్టెంబర్లో శని, సూర్యుని మధ్య ఏర్పడే యోగం 5 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. ఏ రాశులవారికి సమస్యలను ఎదుర్కొంటారో ఇక్కడ చూడండి.
గ్రహాలన్నీ తమ రాశులను, నక్షత్రాలను మార్చుకుంటూ ఉంటాయి. గ్రహాలు ఈ విధంగా సంచరించినప్పుడు, అవి ఇతర గ్రహాలతో కొన్ని యోగాలను ఏర్పరుస్తాయి. ప్రస్తుతం సూర్యుడు సింహరాశిలో, శని మీనరాశిలో సంచరిస్తున్నారు. సెప్టెంబర్ 17న ఉదయం 7:58 గంటలకు సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. శని సూర్యునికి వ్యతిరేక స్థానంలో.. అంటే 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. శని సూర్యునికి 180 డిగ్రీల కోణంలోకి వచ్చినప్పుడు సంసప్తక యోగం ఏర్పడుతుంది. ఈ అరుదైన సంఘటన కొన్ని రాశుల వారికి చెడు అనుభవాలను, ఫలితాలను ఇస్తుంది. సూర్యుడు సెప్టెంబర్ 17న కన్యారాశిలోకి ప్రవేశించి అక్టోబర్ 19 వరకు అక్కడే ఉంటాడు. సంసప్తక యోగం కారణంగా ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.

సింహ రాశి
సంసప్తక యోగం సింహరాశి వారికి అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుంది. ఈ కాలంలో మీరు వివిధ ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. మీరు అనుకున్నవన్నీ ఇప్పుడు సానుకూలంగా ముగియవు. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కార్యాలయంలో చేసే పనులన్నీ చాలా జాగ్రత్తగా చేయాలి. లేకపోతే అది మీకు అనేక సమస్యలను కలిగిస్తుంది. వ్యాపారవేత్తలు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే భారీ నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ కాలం నష్టాలు, వైఫల్యాల సమయం. ఎలాంటి ప్రమాదకరమైన భారీ పెట్టుబడులు పెట్టకుండా ఉండటం, ఖర్చులను నియంత్రించడం చాలా ముఖ్యం.
మకర రాశి
మకర రాశి వారికి ఈ అరుదైన గ్రహస్థితి తీవ్రమైన ఒత్తిడిని కలుగజేస్తుంది. ఫలితంగా మీరు జీవితంలో వివిధ ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. చాలా సందర్భాలలో ఇది విభేదాలకు కూడా దారితీయవచ్చు. బాధ్యతలను నిర్వహించడంలో చాలా జాగ్రత్తగా ఉండండి. లేకపోతే అది మరిన్ని సవాళ్లకు దారితీస్తుంది. మీరు పూర్తి ఉత్సాహంతో చేసే పని కూడా మీరు కోరుకున్న విధంగా ముగియకపోవచ్చు. అనవసరమైన ఆందోళనలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. మీరు ముందుకు వేసే ప్రతి అడుగులోనూ జాగ్రత్తగా ఉండాలి. ఇది కాకుండా విద్యార్థులు తమ చదువుపై ఆసక్తి కనబరిచే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే పనిలో శ్రద్ధగా ఉండండి. విదేశీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి సంసప్తక యోగం సంబంధాలపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ కాలంలో పని ఒత్తిడి పెరగవచ్చు. దీనివల్ల మీరు మీ బాధ్యతలను మరచిపోయే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు తరచుగా సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యల కారణంగా మీరు చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒత్తిడిని ఎదుర్కోవడంలో చాలా ఇబ్బందులు ఉండవచ్చు. పనిలో సమస్యలు మనశ్శాంతికి భంగం కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో మీరు అనేక విధాలుగా సమస్యలను ఎదుర్కొంటారు. ఇంట్లో కుటుంబ సభ్యుల నుండి విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో నవగ్రహ పూజ శుభ ఫలితాలను ఇస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి సంసప్తక యోగం అంత మంచి సమయం కాదు. ఈ సమయంలో మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో పెట్టుబడి పెట్టడం మానుకోండి. పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వవద్దు. కుటుంబ విషయాలు మీ మనశ్శాంతిని దెబ్బతీయవచ్చు. ఆర్థిక చింతలు ఉంటాయి. శని కూడా ఆరోగ్యం క్షీణించే సంకేతాలను సూచిస్తోంది. అందువల్ల పరిస్థితి ఎలా ఉన్నా మీ పని నిర్ణయాలు ప్రమాదానికి దారితీయనివ్వవద్దు. సాధ్యమైనంత వరకు ఓర్పును పాటించడం చాలా ముఖ్యం. మీ ఆర్థిక జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి.
కర్కాటక రాశి
ఈ అరుదైన గ్రహ కలయిక కర్కాటక రాశిపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది . ప్రధానంగా వృత్తి సంబంధిత సమస్యలు మీ మనశ్శాంతికి భంగం కలిగిస్తాయి. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. దీనివల్ల మీ పొదుపు దెబ్బతింటుంది. అనవసరమైన ఆందోళనలు మిమ్మల్ని అనేక విధాలుగా వేధిస్తాయి. ఈ కాలం మీ జీవితంలో మరిన్ని సవాళ్లకు దారి తీస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ జీవిత భాగస్వామితో సమస్యలు మిమ్మల్ని ఒంటరితనంతో సతమతమయ్యేలా చేస్తాయి. ఆర్థికంగా చాలా అలసట కలిగించే పరిస్థితి ఏర్పడవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరిగి మీ దీర్ఘకాలిక ఆర్థిక చింతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


