నువామా బ్రోకరేజ్ అంచనా

జేఎఎల్ ను కొనుగోలు చేయడం వల్ల వేదాంత షేర్లపై ప్రభావం పడే అవకాశం ఉందని నువామా బ్రోకరేజ్ అంచనా వేస్తోంది. ఎందుకంటే ఇది వేదాంత ప్రధాన వ్యాపారానికి సంబంధం లేని విభాగం. అయినప్పటికీ వేదాంత స్టాక్ కు బై రేటింగ్ ను కొనసాగిస్తున్నట్లు నువామా తెలిపింది. రిజల్యూషన్ ప్లాన్ ఖరారైన తర్వాత ప్రభావాన్ని అంచనా వేస్తామని తెలిపింది.
వేదంతపై అదనపు భారం

వేదాంత ఈ లావాదేవీని పూర్తి చేయడానికి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) ఆమోదం అవసరం. దీనికి 8 నుంచి 12 నెలల వరకు సమయం పట్టవచ్చు. వేదాంత ముందస్తుగా రూ. 4,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. వేదాంత జేఏఎల్ లో ప్రధానంగా విద్యుత్ వ్యాపారంపై దృష్టి సారిస్తుందని, మిగిలిన ఆస్తులను క్రమంగా విక్రయించే అవకాశం ఉందని నువామా అంచనా వేస్తోంది. జేఏఎల్ కొనుగోలు వేదాంతలో మైనారిటీ షేర్ హోల్డర్లకు ప్రతికూలంగా మారవచ్చని పేర్కొంది. ఇప్పటికే వేదాంతకు రుణభారం ఉందని, ఇప్పుడు జేఏఎల్ కొనుగోలు కోసం రూ. 17,000 నిధులను సేకరించాల్సి ఉంటుందని తెలిపింది. ఇది రుణభారాన్ని మరింత పెంచవచ్చని పేర్కొంది. అయితే ఆస్తుల అమ్మకం ద్వారా కొంత ఉపశమనం లభిస్తుందని నువామా తెలిపింది.
జేఏఎల్ ఆస్తులు

జేఏఎల్ ఆస్తులలో ఢిల్లీ ఎన్సీఆర్లో 4,000 ఎకరాల భూమి, 2,200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ (జేపీ పవర్లో జేఏఎల్కు 24 శాతంవాటా ఉంది), 10 ఎంటీపీఏ సిమెంట్ ప్లాంట్, 0.72 ఎంటీపీఏ యూరియా ప్లాంట్, ఐదు హోటళ్లు, ఈపీసీ వ్యాపారాలు ఉన్నాయి. వేదాంత తన ప్రస్తుత వ్యాపారాలతో సమన్వయం ఉన్నందున పవర్ ప్లాంట్ను నిలుపుకోవచ్చని, మిగిలిన ఆస్తులను మధ్యకాలంలో విక్రయించవచ్చని నువామా తెలిపింది. ఈ బిడ్ షరతులు లేనిది కాబట్టి, యమునా ఎక్స్ప్రెస్వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీతో సంబంధిత చెల్లింపులు వంటి బాధ్యతలను వేదాంత భరించాల్సి ఉంటుందని తెలిపింది.
గమనిక: ఈ కథనం సమాచారం కోసం మాత్రమే. పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు నిపుణుల సలహా తీసుకోండి.