Veligonda Project : 30 ఏళ్ల కల సాకారం… నేడే వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్ - 1 ప్రారంభం, కరవు నేలకు కృష్ణమ్మ జలాలు!

Published on Aug 31, 2026 06:50 am IST

Veligonda Project Phase 1 Opening : దశాబ్దాల నిరీక్షణకు తెర దించుతూ వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ఇవాళ ప్రారంభిస్తారు. నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను విడుదల చేసేందుకు ఏపీ సర్కార్ ఏర్పాట్లు సిద్ధం చేసింది.

1 / 8
<p>మార్కాపురం జిల్లా ప్రజల దశాబ్దాల నాటి చిరకాల స్వప్నం నెరవేరే సుదినం రానే వచ్చింది. తీవ్ర కరువుతో అల్లాడుతున్న ఈ ప్రాంత దాహార్తిని తీర్చేందుకు రూపుదిద్దుకున్న వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం(ఆగస్ట్ 31) అధికారికంగా ప్రారంభించనున్నారు. 'వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు' పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఈ చారిత్రక ఘట్టాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తోంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Aug 31, 2026 06:50 am IST

మార్కాపురం జిల్లా ప్రజల దశాబ్దాల నాటి చిరకాల స్వప్నం నెరవేరే సుదినం రానే వచ్చింది. తీవ్ర కరువుతో అల్లాడుతున్న ఈ ప్రాంత దాహార్తిని తీర్చేందుకు రూపుదిద్దుకున్న వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం(ఆగస్ట్ 31) అధికారికంగా ప్రారంభించనున్నారు. 'వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు' పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఈ చారిత్రక ఘట్టాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తోంది.

2 / 8
<p>తీవ్ర వర్షాభావం, పాతాళానికి పడిపోయిన భూగర్భ జలాలు, ఇంటింటినీ వేధిస్తున్న ఫ్లోరైడ్ రక్కసి, నీళ్లు లేక బీడువారిన వ్యవసాయ భూములు.. ఇవీ ఇన్నాళ్లూ మార్కాపురం, ప్రకాశం ప్రాంతాల ఘోష. వీటన్నింటికీ వెలిగొండ ప్రాజెక్టు శాశ్వత పరిష్కారం చూపనుంది. శ్రీశైలం జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా కృష్ణా జలాలను తరలించి, నల్లమలసాగర్‌లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి ప్ర��ాన కాలువల ద్వారా తాగు, సాగునీటి అవసరాలకు నీటిని సరఫరా చేసేలా ఈ భారీ ప్రాజెక్టును రూపకల్పన చేశారు.<br> </p> expand-icon View Photos in a new improved layout
Published on Aug 31, 2026 06:50 am IST

తీవ్ర వర్షాభావం, పాతాళానికి పడిపోయిన భూగర్భ జలాలు, ఇంటింటినీ వేధిస్తున్న ఫ్లోరైడ్ రక్కసి, నీళ్లు లేక బీడువారిన వ్యవసాయ భూములు.. ఇవీ ఇన్నాళ్లూ మార్కాపురం, ప్రకాశం ప్రాంతాల ఘోష. వీటన్నింటికీ వెలిగొండ ప్రాజెక్టు శాశ్వత పరిష్కారం చూపనుంది. శ్రీశైలం జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా కృష్ణా జలాలను తరలించి, నల్లమలసాగర్‌లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి ప్రధాన కాలువల ద్వారా తాగు, సాగునీటి అవసరాలకు నీటిని సరఫరా చేసేలా ఈ భారీ ప్రాజెక్టును రూపకల్పన చేశారు.

3 / 8
<p>ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల పరిధిలోని 30 మండలాలకు చెందిన 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అలాగే ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలతో సహా దాదాపు 23 లక్షల మంది ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు లభిస్తుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Aug 31, 2026 06:50 am IST

ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల పరిధిలోని 30 మండలాలకు చెందిన 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అలాగే ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలతో సహా దాదాపు 23 లక్షల మంది ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు లభిస్తుంది.

4 / 8
<p>తాజాగా ప్రారంభమవుతున్న తొలి దశ ద్వారా నల్లమలసాగర్‌కు 10.70 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేస్తారు. దీనివల్ల మొదటి విడతలోనే 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతాయి. నీటి లభ్యత పెరగడంతో పంటల సాగుపై రైతులకు ధైర్యం కలగడమే కాకుండా ఉద్యానవనం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల స్థానికంగానే ఉపాధి అవకాశాలు పెరిగి, పొట్టకూటి కోసం పక్క ప్రాంతాలకు వెళ్లే వలసలకు అడ్డుకట్ట పడుతుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Aug 31, 2026 06:50 am IST

తాజాగా ప్రారంభమవుతున్న తొలి దశ ద్వారా నల్లమలసాగర్‌కు 10.70 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేస్తారు. దీనివల్ల మొదటి విడతలోనే 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతాయి. నీటి లభ్యత పెరగడంతో పంటల సాగుపై రైతులకు ధైర్యం కలగడమే కాకుండా ఉద్యానవనం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల స్థానికంగానే ఉపాధి అవకాశాలు పెరిగి, పొట్టకూటి కోసం పక్క ప్రాంతాలకు వెళ్లే వలసలకు అడ్డుకట్ట పడుతుంది.

5 / 8
<p>వెలిగొండ ప్రాజెక్టు ప్రయాణం సుదీర్ఘమైనది. 1996 మార్చి 5న నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత, అదే చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రాజెక్టు తొలి దశను స్వయంగా ప్రారంభించి నీటిని విడుదల చేస్తుండటం విశేషం.<br> </p> expand-icon View Photos in a new improved layout
Published on Aug 31, 2026 06:50 am IST

వెలిగొండ ప్రాజెక్టు ప్రయాణం సుదీర్ఘమైనది. 1996 మార్చి 5న నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత, అదే చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రాజెక్టు తొలి దశను స్వయంగా ప్రారంభించి నీటిని విడుదల చేస్తుండటం విశేషం.

6 / 8
<p>టన్నెళ్ల నిర్మాణం, ఫీడర్ కాలువలు, భూసేకరణ వంటి ఎన్నో సాంకేతిక, ఆర్థిక అడ్డంకులను అధిగమిస్తూ ఈ పనులు పూర్తయ్యాయి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వెలిగొండకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పనులను పరుగులు తీగించింది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Aug 31, 2026 06:50 am IST

టన్నెళ్ల నిర్మాణం, ఫీడర్ కాలువలు, భూసేకరణ వంటి ఎన్నో సాంకేతిక, ఆర్థిక అడ్డంకులను అధిగమిస్తూ ఈ పనులు పూర్తయ్యాయి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వెలిగొండకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పనులను పరుగులు తీగించింది.

7 / 8
<p>కేవలం 48 రోజుల వ్యవధిలోనే నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం జమ చేసింది. గెజిట్‌లో పేర్లు లేని వారి కోసం మరొక రూ.169 కోట్లు, 2019 తర్వాత 18 ఏళ్లు నిండిన యువతకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించి నిర్వాసితులను ఆదుకుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Aug 31, 2026 06:50 am IST

కేవలం 48 రోజుల వ్యవధిలోనే నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం జమ చేసింది. గెజిట్‌లో పేర్లు లేని వారి కోసం మరొక రూ.169 కోట్లు, 2019 తర్వాత 18 ఏళ్లు నిండిన యువతకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించి నిర్వాసితులను ఆదుకుంది.

8 / 8
<p>ఇవాళ ఉదయం 10.35 గంటలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, వెలిగొండ ఫేజ్-1 పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం ప్రాజెక్టు గేట్లను ఎత్తి కృష్ణా జలాలను విడుదల చేస్తారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Aug 31, 2026 06:50 am IST

ఇవాళ ఉదయం 10.35 గంటలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, వెలిగొండ ఫేజ్-1 పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం ప్రాజెక్టు గేట్లను ఎత్తి కృష్ణా జలాలను విడుదల చేస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!